Home National & International India Approves Nationwide Caste Census:భారతదేశంలో జాతీయ కుల గణనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

India Approves Nationwide Caste Census:భారతదేశంలో జాతీయ కుల గణనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

caste census
caste census

విపక్షాలు, రాష్ట్రాల ప్రభుత్వాలు చేస్తున్న డిమాండ్లకు కేంద్రం తలొగ్గింది. జాతీయ స్థాయిలో కుల గణన చేయాలని నిర్ణయించింది. 2011లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ (UPA) ప్రభుత్వం.. సామాజిక, ఆర్థిక కుల గణనను నిర్వహించినా.. వాటి లెక్కలను మాత్రం బయటపెట్టలేదు. తర్వాత మోదీ (Modi) ప్రభుత్వం కొనసాగుతున్నా కూడా.. వాటి వివరాలు ఇప్పటికీ బయటికి రాలేదు. కానీ.. ఈ సారి మాత్రం అలాంటి పొరబాటు జరక్కుండా పూర్తి స్థాయిలో పక్కా ప్రణాళికతో కుల గణన నిర్వహించేందుకు మోదీ (Modi) ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వాటి వివరాలను కూడా ఖచ్చితత్వంతో జనానికి అందించాలని నిర్ణయించింది. ఇదే జరిగితే.. స్వతంత్ర భారత దేశంలో మొద్దమొదటి సారి జాతీయ స్థాయిలో నిర్వహించే మొదటి కులగణన కానుంది.

వాస్తవానికి కొన్ని దశాబ్దాలుగా ఈ డిమాండ్‌ను ప్రతిపక్షంలో ఉన్న పార్టీలన్నీ వినిపిస్తున్నాయి. రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కోరుతున్నాయి. కానీ.. కారణాలు ఏవైనా.. ఓ సారి కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని కేంద్రం సర్వే నిర్వహించినా.. అనుకున్న ఫలితమైతే రాలేదు. ఇన్నాళ్లకు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం.. ఈ దిశగా తీసుకున్న నిర్ణయంతో.. బీసీలు (BCs – Backward Classes) హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశ జనాభాలో.. బీసీల జనాభానే అత్యధికంగా ఉన్న తరుణంలో.. ఈ కుల గణన జరిగి, రిజర్వేషన్లలో మార్పులు వస్తే.. వారికి భారీగా లబ్ధి చేకూరే అవకాశం కలుగుతుంది. అయితే.. చట్ట సభల్లో (Legislative bodies) కూడా ఇలాంటి వెసులుబాటు ఉంటుందా.. ఉండదా అన్నది ఇక్కడ చర్చనీయాంశం అవుతోంది. చట్ట సభల్లో కూడా ఇదీ తీరుగా నిర్ణయించి.. కొత్త రిజర్వేషన్లను తీసుకువచ్చి వర్తింపజేస్తే.. అక్కడ కూడా తాము ఎదిగేందుకు అవకాశం కలుగుతుందని బీసీలు ఆశిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే బిహార్ (Bihar), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) రాష్ట్రాలు కులగణన నిర్వహించాయి. ఆ లెక్కల ప్రకారం రిజర్వేషన్లలో మార్పులు చేయాలని భావించాయి. 2023లో బిహార్ ప్రభుత్వం కులగణన చేపట్టింది. ఇదే.. స్వతంత్ర భారత దేశంలో ఓ రాష్ట్రం ప్రత్యేకంగా తనకు తానుగా చేపట్టిన కుల గణన. తర్వాత.. 2024లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కుల గణన నిర్వహించాయి. ఇటీవల ఈ సర్వే నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం.. బీసీల లెక్కలు తేల్చింది. కేంద్రానికి కూడా ఆ వివరాలు పంపించింది. మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి గమనిస్తే.. 2021లో కులగణన చేపట్టాలని ఝార్ఖండ్ (Jharkhand) ప్రభుత్వం తీర్మానం చేయగా.. ఒడిశా (Odisha), **మహారాష్ట్ర (Maharashtra)**లలోనూ ఇలాంటి తీర్మానాలు జరిగాయి. ఇంతటి స్థాయిలో ఒత్తిడి ఉన్న కారణంగానే.. కేంద్రం తాజాగా తన వైఖరి మార్చుకుని కులగణన చేపట్టాలని నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా కనిపిస్తోంది.

కేంద్రం చేపట్టాలనుకుంటున్న ఈ సర్వే విజయవంతమైతే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here