Home Andhra Pradesh MSP Hike : ఖరీఫ్ పంటలకు భారీ ఊరట మద్దతు ధరలు పెంచిన కేంద్రం

MSP Hike : ఖరీఫ్ పంటలకు భారీ ఊరట మద్దతు ధరలు పెంచిన కేంద్రం

Central Government Hikes MSP for Kharif Crops
Central Government Hikes MSP for Kharif Crops

రోజుకో పెరిగిపోతున్న పెట్టుబడి ఖర్చులతో వ్యవసాయం కష్టంగా మారిన వేళ, కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను (MSP) పెంచే నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో పంచుకున్నారు.

ఈసారి మొత్తం **14 ఖరీఫ్ పంటల**కు మద్దతు ధర పెంచినట్టు చెప్పారు. ఇందులో ఆహారధాన్యాలు, వాణిజ్య పంటలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు కూడా ఉన్నాయి. ఈ పెంపు **2025–26 మార్కెటింగ్ సీజన్**కు వర్తించనుంది. రైతులు పంట పండించేందుకు అయ్యే ఖర్చుతో పోలిస్తే కనీసం **1.5 రెట్లు MSP** లభించేలా నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

**నైజర్‌సీడ్‌కు క్వింటాలుకు రూ.820 పెంపుతో** అత్యధికంగా మద్దతు ధర పెరిగిందని తెలిపారు. అలాగే రాగి, పత్తి, నువ్వులకూ మంచి పెంపు లభించిందని చెప్పారు. ఈ నిర్ణయం వల్ల రైతులకు మెరుగైన ఆదాయం లభించడమే కాకుండా, పప్పుదిగుమతి, నూనెగింజల సాగును ప్రోత్సహించడమే లక్ష్యమని వివరించారు.

**2014 తర్వాత వరి, ఖరీఫ్ పంటల కొనుగోళ్లలో మరియు MSP చెల్లింపుల్లో గణనీయమైన వృద్ధి** నమోదైందని కూడా కేంద్ర గణాంకాల ఆధారంగా వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here