విక్టరీ వెంకటేష్(Venkatesh) – అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunam) బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సంక్రాంతి సెలవులు పూర్తయినా సినిమా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ నమోదు చేస్తోంది. ఇప్పటి వరకూ బుక్ మై షోలో 2.5 మిలియన్ టికెట్లు అమ్ముడయ్యాయి. రామ్ చరణ్(Ram charan) గేమ్ ఛేంజర్(Game Changer) కోసం కేటాయించిన థియేటర్లలో కూడా ఈ సినిమానే ప్రదర్శిస్తున్నారు. మరోవైపు ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడంతో వెంకీమామ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నారు.
వారం రోజుల్లో రూ. 203 పైగా కోట్లు..
విడుదలైన వారం రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 203+ కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృదం సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో భీమ్స్ అందించిన పాటలు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. ‘గోదారి గట్టు’ సాంగ్ 121 మిలియన్ వ్యూస్తో టాప్-100 మ్యూజిక్ వీడియోల్లో నెంబర్1గా ఉంది.
సంక్రాంతికి వస్తున్నాం’ వెంకటేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్టుగా నిలిచింది. ఇప్పటివరకు వెంకీమామ నటించిన చిత్రాల్లో.. రూ.132 కోట్లతో అత్యధిక వసూళ్లు చేసిన మూవీగా ‘ఎఫ్2’ ఉండగా.. ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఆ రికార్డును బ్రేక్ చేసింది. సీనియర్ హీరోల్లో రూ.200 కోట్లు వసూళ్లు చేసిన నటుల్లో చిరంజీవి తర్వాత ఆ రికార్డును వెంకటేష్ అందుకున్నారు. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, సైరా నరసింహా రెడ్డి చిత్రం రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి.