Home Crime Karnataka: రోజు తికమక పెడుతున్న రన్యారావు..

Karnataka: రోజు తికమక పెడుతున్న రన్యారావు..

ranya rao
ranya rao

బంగారం స్మగ్లింగ్‎లో(Gold smugling) చిక్కుకున్న నటి రన్యారావు(Ranya rao), విచారణ సమయంలో నిర్లిప్తంగా అంగీకరించిన వాదనలను మార్చి అనేక కాదనలతో పోలీసులను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. మొదట తనను చెంపపై కొట్టారని చెప్పిన రన్యా, తర్వాత కోర్టులో మాత్రం కొట్టలేదని, తన న్యాయవాది ద్వారా చెప్పిందని పేర్కొంది. ఆమెను అరెస్టు చేసినప్పటి నుండి 15 సార్లు చెంపదెబ్బలు కొట్టినట్టు చెప్పింది. ఆమె వాదన ప్రకారం, పలుసార్లు తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకోవాలని బలవంతంగా ఒత్తిడి చేసినట్టు పోలీసులకు తెలిపింది. చివరకు ఒత్తిడితో 50-60 పేజీలపై సంతకాలు చేసిందని, ఆ సమయంలో ఆమెపై ఎటువంటి బంగారం స్వాధీనం చేయలేదని ఆరోపించింది.

రన్యారావు తండ్రికి మరో షాక్, ఆమె సవతి తండ్రి డీజీపీ రామచంద్రరావుకు కర్ణాటక ప్రభుత్వం తప్పనిసరి సెలవు విధించింది. ఈ అంశంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, తనకు ఈ విషయంపై ఎలాంటి సమాచారం లేదని అన్నారు. రన్యారావు ప్రస్తుతం తన భర్తతో కలిసి ఉండటం గురించి ఆయన పేర్కొన్నారు.

అదే విధంగా, రన్యారావు బెయిల్ పిటిషన్ ను ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో రన్యారావు విదేశాల నుంచి బంగారం తరలించడానికి పోలీసు అధికారుల సహకారం తీసుకున్నట్టు డీఆర్ఐ(DRI) కోర్టుకు తెలిపింది. 27 సార్లు దుబాయ్‌కు వెళ్లి వచ్చినట్లు కోర్టు పేర్కొంది. ఈ కారణంగా, ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి తిరస్కరించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here