Home Andhra Pradesh Kakani Govardhan Reddy : మాజీ మంత్రిపై కేసు నమోదు!

Kakani Govardhan Reddy : మాజీ మంత్రిపై కేసు నమోదు!

kakani govardhan reddy
kakani govardhan reddy

వైసీపీ (YCP) మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Kakani Govardhan Reddy) పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కేసు నమోదు చేయబడింది. ఇది కావలి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో జరిగినది. ప్రజలు, పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నాయకుడు వంటేరు ప్రసన్న కుమార్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో సెక్షన్లు 224, 351/2, 352, 353/2 కింద పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

ఇటీవల బోగోలు మండలంలోని కోళ్లదిన్నె గ్రామంలో టీడీపీ, వైసీపీ (TDP vs YCP) మధ్య ఘర్షణ జరిగింది, ఇందులో రెండు వర్గాలవారూ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. అనంతరం వారిని కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా ఇరు వర్గాలవారు మరోసారి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో, కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ నేతలను(YCP Leaders) పరామర్శించడానికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. “ఈసారి వైసీపీ ప్రభుత్వం వస్తుందే,” అని చెప్పారు. “పోలీసులు ఎక్కడ ఉన్నా వారి బట్టలు ఉడదీస్తాం” అంటూ ఆయన ప్రకటనలు చేశారు. టీడీపీ నేతలను ఏలా అయినా వదలాలని కూడా ఆయన బహిరంగంగా శపధం చేశారు. దీంతో ప్రసన్న కుమార్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పై కేసు నమోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here