తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) [Telangana State Road Transport Corporation – TSRTC]లో సమ్మె సంకేతాలు మొదలయ్యాయి. కార్మిక సంఘాలు గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆందోళనలు చేస్తున్నా, స్పందన లేకపోవడంతో మే 7వ తేదీ నుంచి సమ్మెకు సిద్ధమవుతున్నట్లు ఆర్టీసీ జేఏసీ (RTC JAC) చెబుతోంది. జనవరి 27న అధికారికంగా నోటీసు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మికుల సమస్యల పరిష్కారం, కాంగ్రెస్ [Congress] హామీల అమలు వంటి డిమాండ్లతో జేఏసీ సమ్మె బాట పట్టనుందని చైర్మన్ ఈదుర వెంకన్న (Eeduru Venkanna) వెల్లడించారు.
హిమాయత్నగర్లోని ఏఐటీయూసీ (AITUC) కార్యాలయంలో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో కార్మిక నేతలు సమ్మెకు మద్దతుగా నిర్ణయం తీసుకున్నారు. మే 1న డిపోలలో మేడే జెండాలు ఎగురవేసి, మే 5న కార్మిక కవాతు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అలాగే మే 7నుంచి సమ్మె ప్రారంభమవుతుందనీ, ఆ రోజు కళ్యాణ మండపం నుంచి బస్సు భవన్ (Bus Bhavan) వరకు యూనిఫార్స్లో కార్మికులు కవాతులో పాల్గొంటారని తెలిపారు. కొన్ని యూనియన్లు ముందుగా జేఏసీలో చేరతామన్నా, ఆ తర్వాత యాజమాన్యానికే మద్దతుగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్మికులు సంఘాలకతీతంగా కలసి ఉద్యమించాలంటూ పిలుపునిచ్చారు.
ఎలక్ట్రిక్ బస్సుల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, వాటిని ఆర్టీసీ యాజమాన్యమే నడిపాలంటూ డిమాండ్ చేశారు. 2021 వేతన సవరణ అమలు చేయడంతో పాటు పెండింగ్ బకాయిలు చెల్లించాలని, అలాగే రిటైరైన 16 వేల మంది ఉద్యోగుల స్థానాల్లో నూతన నియామకాలు చేపట్టాలని జేఏసీ కోరుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, ఉద్యోగులను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక అశాంతి తలెత్తకుండా ప్రభుత్వం సమయానికి జోక్యం చేసుకోవాలని సూచించారు.
సింహాచలం ప్రమాద ఘటనపై ప్రధాని (Prime Minister) సంతాపం…. మృతుల కుటుంబాలకు పరిహారం..