Home Andhra Pradesh Y.S. Sharmila House Arrest :రాజధాని ప్రాంతం పర్యటనకు ముందు వైఎస్ షర్మిల గృహ నిర్బంధం

Y.S. Sharmila House Arrest :రాజధాని ప్రాంతం పర్యటనకు ముందు వైఎస్ షర్మిల గృహ నిర్బంధం

HOUSE ARREST
HOUSE ARREST

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Y.S. Sharmila) విజయవాడలోని తన నివాసంలో హౌస్ అరెస్ట్‌కి గురయ్యారు. ఆమె ఉద్దండరాయునిపాలెం ప్రాంతాన్ని పర్యటించాలన్న ఉద్దేశంతో బయలుదేరేలోపే, పోలీసులు ఆమెను గృహ నిర్బంధంలో ఉంచారు. 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రాంతం కావడంతో, షర్మిల పర్యటనను పోలీసులు అనుమతించలేదు. దీనివల్ల ఆమె ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ఈ పరిణామాలపై షర్మిల (Sharmila) తీవ్రంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆమె ప్రభుత్వం తీరును ప్రశ్నిస్తూ, తనను గృహ నిర్బంధంలో ఉంచడాన్ని రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)తో పాటు, ప్రభుత్వ అధికారులు ఎందుకు భయపడుతున్నారనే ప్రశ్నను ఆమె విసిరారు. తాను ఏకంగా పీసీసీ కార్యాలయానికే వెళ్తున్న సమయంలో అడ్డుకోవడం ఏమిటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక మే 2న ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అమరావతిలో పర్యటించనున్న నేపథ్యంలో, ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో వైఎస్ షర్మిల (Y.S. Sharmila)పై పూల ప్రేమ్ కుమార్ (Pool Prem Kumar) అనే వ్యక్తి పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. షర్మిల (Sharmila) ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రధానిపై అనుచితంగా ఉన్నాయని, దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆ రోజు నుంచి బస్సులు బంద్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here